Sunday, March 1, 2020

ఒత్తిడిని దూరం చేసుకోవడానికి 'ప్రకృతి' చిట్కా!

  • ఒత్తిడి తగ్గాలంటే ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు ప్రకృతిలో గడపాలి
  • ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి
  • తేల్చిన అమెరికా పరిశోధకులు
ఉదయాన్నే పాఠశాలకు, సాయంత్రం ట్యూషన్‌కు వెళుతూ పోటీ ప్రపంచంలో చిన్నప్పటి నుంచే విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆటలు ఆడకపోవడం, ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఉండకపోతుండడంతో వారిని సమస్యలు చుట్టుముడుతున్నాయి. పిల్లల్లో ఒత్తిడి తగ్గాలంటే ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు ప్రకృతిలో గడపాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని తేల్చారు. తమకు ఇష్టమైన రంగాల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్పారు. 15-30 సంవత్సరాల వయసున్న కొంత మందిపై చేసిన పరిశోధనల ఫలితంగా అమెరికా పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. పార్కుల్లో గడిపిన వారిలో మానసికంగా సానుకూల మార్పు కనిపించిందని తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంతో ఫొటో దిగిన ఆనంద్‌ మహీంద్ర

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఆనంద్‌ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో షేర్ చేసిన బిజినెస్‌మన్‌ ఆనంద్‌ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనంటోన్న నెటిజన్...