Sunday, March 1, 2020

'ఒత్తిడి' గురించి మరో కొత్త విషయం కనిపెట్టిన పరిశోధకులు






  • వివరాలు తెలిపిన అమెరికాలోని పెన్‌ స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు

  • ఒత్తిడి పెరిగితే సామాజిక ప్రయోజనం కూడా 

  • ఒత్తిడి వల్ల తోటివారి నైతిక మద్దతు 

  • తామున్నామన్న భరోసా  



ఎంతటి మనిషినైనా ఒత్తిడి చిత్తు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కొంత మేరకు ఒత్తిడి వల్ల పనిలో రాణిస్తారని కూడా చాలా మందికి తెలుసు. అయితే, ఒత్తిడి గురించి పరిశోధనలు చేసిన అమెరికాలోని పెన్‌ స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కనిపెట్టారు. మనిషిలో ఒత్తిడి పెరిగితే సామాజిక ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పారు.

పని, చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో మనుషులు పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటారు. ఆ సమయంలో వారికి తోటివారు నైతిక మద్దతు పలుకుతున్నారని గుర్తించారు. వారికి తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారని తేల్చారు. దీంతో ఒత్తిడి వల్ల సామాజిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంతో ఫొటో దిగిన ఆనంద్‌ మహీంద్ర

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ఆనంద్‌ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఫొటో షేర్ చేసిన బిజినెస్‌మన్‌ ఆనంద్‌ మహీంద్ర కూడా ఉక్కు మనిషేనంటోన్న నెటిజన్...